Asaduddin Owaisi: రాహుల్ గాంధీ ఒంటరిగా ఉండకండి.. అసదుద్దీన్ ఓవైసీ సెటైర్లు

ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్  ఓవైసీ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రుడంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ రాహుల్‌కు ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకరు ఇటలీ, రెండో వ్యక్తి మోదీ అని అన్నారు.

  • Written By:
  • Updated On - November 26, 2023 / 08:38 PM IST

Asaduddin Owaisi: ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్  ఓవైసీ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తనను ప్రధాని నరేంద్ర మోదీకి మిత్రుడంటూ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ సభలో ఓవైసీ మాట్లాడుతూ రాహుల్‌కు ప్రాణంగా ప్రేమించే ఇద్దరు వ్యక్తులు ఉన్నారని, ఒకరు ఇటలీ, రెండో వ్యక్తి మోదీ అని అన్నారు.

ఇంట్లో ఒకరు ఉంటే మంచిది..(Asaduddin Owaisi)

ఇటలీ ఎందుకంటే అతని తల్లి అక్కడి నుండి వచ్చింది. మోదీ అతనికి అధికారం ఇస్తాడు అని ఒవైసీ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఒవైసీ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ప్రజలు రాహుల్ గాంధీకి స్నేహితులు కాకపోవడానికి గల కారణాన్ని కూడా అడిగారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ  చేతిలో రాహుల్ ఓటమి పాలయ్యారు.  అయితే కేరళలోని వాయనాడ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.రాహుల్ గాంధీ, నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి మీకు 50 ఏళ్లు నిండినందున ఒంటరిగా ఉండకండి అని ఒవైసీ అన్నారు. రాహల్ కు ఇంట్లో భాగస్వామి లేనందున, అతను ఎప్పుడూ స్నేహితుడు గురించే ఆలోచిస్తాడని, మాట్లాడుతాడని ఒవైసీ అన్నారు. ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే అతనికి ప్రయోజనంగా ఉంటుంది. అంటే పెళ్లి చేసుకోండంటూ ఓవైసీ  పరోక్షంగా సెటైర్లు వేసారు.

తెలంగాణలో శనివారం జరిగిన బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తూ, అధికార భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం అవినీతిమయమైందని, బీజేపీ, ఏఐఎంఐఎం అంతా ఒక్కటేనని వ్యాఖ్యానించిన తర్వాత ఒవైసీ ఈ విధంగా స్పందించారు.మోదీకి ఇద్దరు మిత్రులున్నారని ఒకరు ఒవైసీ, మరొకరు కేసీఆర్‌ అని రాహుల్‌ అన్నారు.