Pawan Kalyan: పవన్ కళ్యాణ్ హత్యకు రూ.250 కోట్ల సుపారీతో బిగ్ డీల్

ఏపీ రాజకీయాలను కుదిపేసే సంచలన నిజాలను కేంద్ర నిఘా వర్గాలు భయటపెట్టాయి. తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో పవన్‌ను హత్య చేయాడానికి భారీ ప్రణాళికే రచించినట్లే తెలస్తుంది.

  • Written By:
  • Publish Date - November 3, 2022 / 03:26 PM IST

Andhra Pradesh: ఏపీ రాజకీయాలను కుదిపేసే సంచలన నిజాలను కేంద్ర నిఘా వర్గాలు భయటపెట్టాయి. తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో పవన్‌ను హత్య చేయాడానికి భారీ ప్రణాళికే రచించినట్లే తెలస్తుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను అంతమొందిచండానికి రూ.250 కోట్ల భారీ సుపారి చేతులు మారినట్లు కేంద్ర నిఘా వర్గాలకు ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఫోన్ సంభాషణలు రికార్డ్ చేస్తున్నప్పుడు, ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయని తెలుస్తుంది.

దీని పై కేంద్ర నిఘా వర్గాలు లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ డీల్ వెనుక ఆలోచన ఎవరిది? డీల్ ను అమలు చేస్తున్నది ఎవరు? సుపారిగా అడ్వాన్స్ ఎంత ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? కుట్రను ఏవిధంగా అమలు చేయాలనుకుంటున్నారు? అన్న విషయాల పై కేంద్ర నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. ఈ సుపారికి కొంత మొత్తం నగదు విదేశాలలో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాలు బయటపెట్టాయి.

ఆగస్టు 19న కడప జిల్లా సిద్ధవటంలో జరిగిన రైతు భరోసా సభలో కూడా కిరాయి హంతకులు సంచారం ఉన్నట్లు గుర్తించారు నిఘా వర్గాలు. సిద్ధవటం వెళుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ లోకి గుర్తు తెలియని వాహనం ప్రవేశించటానికి ప్రయత్నం చేసింది. కాన్వాయ్ లోని రక్షణ సిబ్బంది అప్రమత్తమై హెచ్చరించడంతో వాహనంలోని వారు తమ వాహనాన్ని దారి మళ్లించుకున్నారు. ఇటీవల ఓ రాష్ట్రంలో జరిగిన ఒక క్లోజ్డ్ గ్రూప్ మీటింగ్ లో “అన్నా అతనిని చంపేయండన్నా, అతన్ని భరించ లేక పోతున్నాం” అని ఒక నాయకుడు అన్నట్లు బయటికి పొక్కింది. పవన్‌ హత్య చేయడమే లక్యంగా బెంగుళూరు, చెన్నై నగరాలలో ఒక వర్గం వారు పలు ధఫాలు సమావేశమైనట్లు తెలిసింది.