Site icon Prime9

Duvvada: ట్రైన్, ఫ్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కున్న విద్యార్ధిని

Train

Train

Duvvada: ట్రైన్ దిగుతున్న సమయంలో జారిపడి ఒక యువతి ట్రైన్‌కు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యన ఇరుక్కుపోవడంతో గంట పాటు నరకయాతన అనుభవించింది. విశాఖపట్నం జిల్లాలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని విజ్ఞాన్ కాలేజీలో ఎంసీఏ చదువుతోంది. ఆమె బుధవారం గుంటూరు నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలులో దువ్వాడ చేరుకుంది. ట్రైన్ దిగుతున్నసమయంలో హడావిడిలో ఆమె జారి రైలు ప్లాట్‌ఫారమ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. ఆ యువతి భయంతో కేకలు వేయడంతో అందరూ అవాక్కయ్యారు.రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి రైలును ఆపి బాలికను రక్షించారు. ఆమెను చాకచక్యంగా బయటకు తీసి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. యువతిని కాపాడిన రైల్వే సిబ్బందిని స్థానికులు అభినందించారు.

 

Exit mobile version
Skip to toolbar