Site icon Prime9

Manchu Manoj: నాకు న్యాయం చేయండి – తండ్రి మోహన్‌ బాబు ఫిర్యాదుపై మనోజ్‌ రియాక్షన్‌

Manchu Manoj Released Press Note: నటుడు మంచు మోహన్‌ బాబు కుటుంంబంలో వివాదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. ఎట్టకేలకు అసలు విషయాన్ని మంచు మనోజ్‌ బట్టబయలు చేశాడు. రెండు రోజులు మంచు ఫ్యామిలీలో ఘర్షణ జరిగింది, తన కొడుకు మనోజ్‌పై మోహన్‌ బాబు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను సోమవారం మోహన్‌ బాబు పీఆర్‌ టీం ఖండించింది. ఈ వార్తల్లో నిజం లేదంటూ ఓ ప్రకటన ఇచ్చింది. కానీ, ఇది జరిగిన కాసేపటికే మనోజ్‌ గాయాలతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

చికిత్స అనంతరం కాసేపటికే మనోజ్‌ తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పహాడీ షరీఫ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మనోజ్‌ ఫిర్యాదు అనంతరం మోహన్‌ బాబు రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు. తన కుమారుడు మనోజ్‌ అతడి భార్య మౌనిక వల్ల తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అసాంఘిక శక్తుల నుంచి తన ప్రాణానికి, ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు మనోజ్‌పై 329,351,115 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. అయితే తన తండ్రి తనపై చేసిన ఆరోపణలపై కొన్ని గంటల క్రితం మనోజ్‌ ఓ ట్వీట్‌ చేశాడు. ఈ పోస్ట్‌ ద్వారా సుదీర్ఘ లేఖ విడుదల చేశాడు.

నా గొంతు నొక్కడానికి ఇదంతా..

‘నాపై నా భార్య మౌనికపై నా తండ్రి డాక్టర్ ఎం. మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన తప్పుడు ఆరోపణలు నాకు బాధ కలిగించాయి. నా తండ్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్దం. నా పరువు, నా గొంతును నొక్కడానికి, కుటుంబ కలహాలు సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా చేసే ప్రయత్నంలో ఇదొక భాగం అంటూ మనోజ్‌ కొన్ని కీలక విషయాలను వెల్లడించాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌లను కూడా ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశాడు.

Exit mobile version
Skip to toolbar