Srisailam temple: శ్రీశైలం దేవస్ధానంలో పేలిన బాయిలర్.. పరుగులు తీసిన భక్తులు

ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్ధానంలో అగ్ని ప్రమాదం సంబవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ఘటన చోటు చేసుకొనింది.

Srisailam: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం దేవస్ధానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయంలోని అన్నపూర్ణ భవన్ లో ఈ ఘటన చోటుచేసుకొనింది. వంటకు వినియోగించే బాయిలర్ పేలడంతో భక్తులు ఉదుటన పరుగులు తీశారు. పేలుడు తీవ్రతకు బాయిలర్ లోని ఎస్ఎస్ ట్యాంకు ఎగిరిపడింది. ఘటనా సమయంలో సిబ్బంది లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకొన్న ఆలయ అధికారులు హుటాహుటిన ఘటనాస్ధలానికి చేరుకొని ప్రమాదం పై ఆరా తీశారు.

ఇది కూడా చదవండి: Sabari Express: పట్టాలకు అడ్డంగా రాడ్డు.. శబరి ఎక్స్‌ప్రెస్‌ కు తప్పిన ప్రమాదం