Kerala: బ్రేకప్ కు నిరాకరించిన ప్రియుడికి విషమిచ్చి చంపి ఆత్మహత్యకు ప్రయత్నించిన యువతి

కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్‌లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

  • Written By:
  • Publish Date - October 31, 2022 / 06:02 PM IST

Thiruvananthapuram: కేరళలో తనతో విడిపోవడానికి నిరాకరించినందుకు తన 23 ఏళ్ల యువకుడికి విషమిచ్చి చంపిన యువతి తరువాత పోలీస్ స్టేషన్‌లో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. మేము ఆమె చేసిన పనిని వెంటనే గ్రహించి ఆసుపత్రికి తీసుకెళ్లాము. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు.

మరో వ్యక్తితో వివాహం నిశ్చయించుకున్న తర్వాత తన 23 ఏళ్ల ప్రియుడికి విషమిచ్చినట్లు అంగీకరించిన నిందితురాలిని నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్టోబరు 14న తన ఇంటికి ఆహ్వానించిన తర్వాత ఆమె అతనికి పురుగుమందు కలిపిన ఆయుర్వేద కషాయాన్ని అందించిందని పోలీసు అధికారి అజిత్ కుమార్ తెలిపారు. ఆ వ్యక్తి 10 రోజులకు పైగా వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ అక్టోబర్ 25న మరణించాడు.

ఆమె వివాహం మరొక వ్యక్తితో నిశ్చయించబడింది. తర్వాత ఆమె అతనిని చాలా రకాలుగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతను అంగీకరించలేదు. దీనితో ఆమె అతనిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అయితే ఆ వ్యక్తి చనిపోయే ముందు విషప్రయోగంలో యువతి పాత్ర గురించి ఏమీ ప్రస్తావించలేదు. అక్టోబర్ 20న మేజిస్ట్రేట్ అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో యువతి తల్లిదండ్రుల ప్రమేయం కూడా ఉందని బాధితుడి తండ్రి ఆరోపించారు.