Prime9

MP YS Avinash Reddy : ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ..

MP YS Avinash Reddy : ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. వైఎస్‌ అవినాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్‌ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా అవినాష్‌ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఆదేశించలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో నేడు జరగబోయే విచారణ కీలకంగా మారనుంది.

YouTube video player

Exit mobile version
Skip to toolbar