Site icon Prime9

IPL 2025: ఆపరేషన్ సిందూర్.. ఐపీఎల్ మ్యాచ్ లు జరగుతాయా?

ipl

ipl

Operation sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాంలో అమయాకులైన 26 మంది పర్యాటకులను చంపిన పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపేందుకు భారత్ కార్యచరణ చేపట్టింది. కొద్దిరోజులుగా వాణిజ్య, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని రద్దు చేసుకున్న భారత్.. గత అర్ధరాత్రి నుంచి ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తోంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముష్కరులు హతమైనట్టు సమాచారం. అయితే భారత్ జరిపిన దాడులకు సరైన బదులిస్తామని పాకిస్తాన్ అంటోంది.

 

ఈ నేపథ్యంలోనే దేశంలో జరగుతున్న ఐపీఎల్ సీజన్ జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ లో ఇంకా 18 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. కాగా మే25న మ్యాచ్ ఉంది. ప్రస్తుతం గ్రూప్ మ్యాచ్ లు చివరిదశకు చేరుకున్నాయి. త్వరలోనే నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. లీగ్ లో  అన్ని దేశాల క్రికెటర్లు ఆడుతున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులతో ఆయా దేశాలు తమ ప్లేయర్లను వెనక్కి రప్పించుకుంటాయా? అనేది తేలాల్సి ఉంది.

 

అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని పరిస్థితులు ఐపీఎల్ పై ప్రభావం చూపవని.. అత్యవసరమైతే తగిన నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ చెప్పినట్టు వర్గాలు తెలిపాయి. గతంలో కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ మ్యాచ్ లను వేరే దేశాల్లో నిర్వహించామని అన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar