Ashok Gehlot: కాంగ్రెస్ అధ్యక్షపదవి రేసు నుంచి అశోక్ గెహ్లాట్‌ అవుట్

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.

  • Written By:
  • Updated On - September 27, 2022 / 01:25 PM IST

New Delhi: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసు నుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు. మల్లికార్జున్ ఖర్గే, దిగ్విజయ్ సింగ్ తదిరులు ఇప్పుడు పోటీలో ఉన్నారు.

రాహుల్ గాంధీ “భారత్ జోడో యాత్ర” మధ్యలో పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా తిరుగుబాటుకు పన్నాగం పన్నినందుకు అశోక్ గెహ్లాట్‌ పై కాంగ్రెస అధినాయకత్వం ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. 71 ఏళ్ల గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి నిరాకరించడం నాయకత్వానికి చికాకు కలిగించిందని వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ యొక్క “ఒకే వ్యక్తి, ఒక పదవి” విధానం ప్రకారం, తాను ద్విపాత్రాభినయం చేయడానికి అనుమతించబోనని రాహుల్ గాంధీ స్పష్టం చేసిన తర్వాత గెహ్లాట్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి అంగీకరించారు. ఆదివారం గెహ్లాట్ ఇంట్లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశానికి, కేంద్ర పరిశీలకులుగా సమావేశానికి హాజరైన అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గేలు పరిశీలకులుగా వచ్చారు. గెహ్లాట్ ఇంటికి 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. గెహ్లాట్‌కు సన్నిహితుడైన మంత్రి శాంతి ధరివాల్ ఇంట్లో జరిగిన సమావేశానికి చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆ సమావేశం తరువాత, వారు ప్రత్యేక బస్సులో స్పీకర్ ఇంటికి వెళ్లారు మరియు 2020లో గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన అతని ప్రత్యర్థి సచిన్ పైలట్ ముఖ్యమంత్రిగా నియమించినట్లయితే రాజీనామా చేస్తామని బెదిరించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని బహిరంగంగా ధిక్కరిస్తూ ఇద్దరు కేంద్ర నాయకులను వ్యక్తిగతంగా కలవడానికి ఎమ్మెల్యేలు నిరాకరించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత మాత్రమే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలనే షరతులు పెట్టారు.

మరోవైపు అశోక్ గెహ్లాట్ నా చేతుల్లో ఏమీ లేదు. ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర నాయకత్వానికి చెప్పారు. గెహ్లాట్ క్రియాశీల మద్దతు మరియు ప్రోత్సాహం లేకుండా 92 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలను బెదిరించగలరని ఢిల్లీలో ఎవరూ నమ్మటంలేదు. గెహ్లాట్ క్షమాపణలు చెప్పినప్పటికీ, కాంగ్రెస్ నాయకత్వం ఈ క్రమశిక్షణా రాహిత్యాన్ని సీరియస్ గా తీసుకుంది. దీనితో కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే మరియు దిగ్విజయ్ సింగ్ వంటి అభ్యర్థులను పరిశీలిస్తోంది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పేరు కూడా తెరపైకి వచ్చింది, అయితే ఆయన నిన్న సాయంత్రం సోనియా గాంధీతో సమావేశమై తాను రాష్ట్ర రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తానని చెప్పినట్లు సమాచారం.