TRS now BRS: తెరాస..అయిందిక… భారత రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు

CM KCR: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారుస్తూ ఆ పార్టీ అధినేత సీఎం కేసిఆర్ తీర్మానంపై సంతకం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో నిర్వహించిన తెరాస సర్వసభ్య సమావేశంలో తొలుత తీర్మానం పెట్టగా. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.

దీంతో ఇకపై తెరాస భారత్ రాష్ట్ర సమితి (భారాస)గా మారనుంది. గత కొద్ది నెలలుగా కేసిఆర్ జాతీయ పార్టీపై వార్తలు హల్ చేశాయి. ఉద్యమ నేతగా కేసిఆర్  నేటి ప్రకటనతో ఇకపై టీఆర్ఎస్ శ్రేణులు భారాస శ్రేణులుగా ప్రజలతో మమేకం కానున్నారు. కేసిఆర్ కు మునుగోడు ఉప ఎన్నికను తొలి విజయ కానుకగా ఇచ్చేందుకు ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఊవిళ్లూరుతున్నారు.

ఇది కూడా చదవండి:Minister KTR: టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకొన్న మాజీ ఎమ్మెల్యే నల్లాల