Kasani Gnaneshwar: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ప్రమాణస్వీకారం

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ గురువారం ప్రమాణస్వీకారం చేసారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 03:07 PM IST

Hyderabad: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్ గురువారం ప్రమాణస్వీకారం చేసారు. ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కాసాని జ్జానేశ్వర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో బలం పుంజుకుంటున్నామని, గ్రామ, గ్రామాన, మండలాల వారీగా టీడీపీ కార్యకర్తలు, యువకులను సమాయత్తం చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో పలు పార్టీలో ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారని జ్ఞానేశ్వర్‌ అన్నారు. రాష్ట్రంలో పేదలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తానని ఆయన తెలిపారు.