Site icon Prime9

YS Avinash Reddy: ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ.. న్యాయవాది సమక్షంలో ప్రశ్నలు

Avinash reddy

Avinash reddy

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో భాగంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ మంగళవారం విచారించింది. సుమారు నాలుగున్నర గంటలపాటు అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. ఈ కేసులో నాలుగో సారి సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి హాజరు అయ్యారు.

నాలుగు గంటల పాటు విచారణ.. (YS Avinash Reddy)

వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలపాటు అధికారులు విచారించారు. హైదరాబాద్ సీబీఐ ఆఫీసులో ఈ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో న్యాయవాది నాగార్జున సమక్షంలో అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి విచారణ జరగింది. విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి ఇద్దరు న్యాయవాదులను వెంట తీసుకొని వెళ్లారు. అయితే విచారణ గదిలోకి అవినాష్‌రెడ్డితో పాటు న్యాయవాది నాగర్జునను మాత్రమే సీబీఐ లోపలికి అనుమతించింది. కాగా నేడు కూడా 160 సీఆర్‌పీసీ కింద విచారణ చేపట్టారు.  ఈ మేరకు స్టేట్‌మెంట్‌ను సీబీఐ రికార్డు చేసింది.

రిజర్వులో తీర్పు..

కాగా, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కాకుండా మినహాయింపు కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు. కానీ అవినాష్ రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

దీంతో పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న అవినాష్ అభ్యర్థనను కూడా తోసిపుచ్చింది.

అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని కోర్టు.. సీబీఐని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె .లక్ష్మణ్‌ సోమవారం ఆదేశాలిచ్చి.. తన తీర్పును రిజర్వు చేశారు.

వివేకా హత్య కేసులో తనను అరెస్టు చేయరాదని.. తనను విచారించకుండా అడ్డుకోవాలని.. తన వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలని..

విచారణకు తన న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ అవినాశ్‌రెడ్డి రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. సీబీఐ తరఫున స్పెషల్‌ పీపీలు నాగేంద్రన్‌, డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ వాదనలు వినిపించారు.

వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి పాత్రకు సంబంధించిన వివరాలతో భారీ సీల్డ్‌ కవర్‌ను కోర్టుకు అందజేశారు.

Exit mobile version
Skip to toolbar