Site icon Prime9

Pocharam Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy

Pocharam Srinivas Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మాజీ స్పీకర్ పోచారం నివాసాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

రైతుల సంక్షేమం కోసం..(Pocharam Srinivas Reddy)

ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం పోచారం శ్రీనివాస్‌రెడ్డి మార్గదర్శకత్వం తీసుకుంటాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ రెడ్డికి తగిన గౌరవం ఇస్తుందని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తన సహకారం తీసుకుంటామని, ఇది రైతు సంక్షేమ రాజ్యమని, రైతుల సంక్షేమానికి అందరినీ కలుపుకుపోతామని చెప్పారు. కాగా, పంట రుణాల మాఫీకి సంబంధించిన విధివిధానాలపై తెలంగాణ కేబినెట్ ఈరోజు భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాస్‌రెడ్డి నాలుగో వ్యక్తి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ముగ్గురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు.

ఇలా ఉండగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి మారనున్నారనే వార్తల నేపథ్యంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆయన నివాసం వద్ద నిరసనకు దాగారు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. బంజారాహిల్స్‌లోని పోచారం ఇంటి వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించిన పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు రంగప్రవేశం చేసి అరెస్ట్ చేశారు.

పోచారం శ్రీనివాస్ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి | Pocharam Srinivas Reddy | Prime9

 

 

Exit mobile version
Skip to toolbar