Vijayasai Reddy: దున్నపోతు శరీరం.. ఆవగింజంత మెదడు కూడా లేదు.. విజయసాయి రెడ్డి

సీఎం జగన్ ప్రైవేటు విమానాల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న టీడీపీ నేత పట్టాభిరాం వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు

  • Written By:
  • Updated On - November 18, 2022 / 12:45 PM IST

Andhra Pradesh: సీఎం జగన్ ప్రైవేటు విమానాల ద్వారా నల్లధనాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్న టీడీపీ నేత పట్టాభిరాం వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పట్టాభికి దేవుడు దున్నపోతులా శరీరాన్ని ఇచ్చాడు కాని ఆవగింజంత కూడ మెదడు ఇవ్వలేదంటూ ట్విట్టర్ లో సెటైర్లు వేసారు.

ఒరేయ్ ‘పొట్టా’భి! నువ్వేం మాట్లాడతావో నీకే తెలియదురా! గతంలో ఇలా మాట్లాడే మాల్దీవ్స్ పారిపోవాల్సి వచ్చింది. నీకు దేవుడు దున్నపోతులా శరీరాన్నిచ్చాడు కానీ అందులో ఆవగింజంత కూడా మెదడు పెట్టడం మర్చిపోయాడురా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసారు.

మరో ట్వీట్ లో తనకు కాలం చెల్లిందని మా అన్నయ్య చంద్రబాబు స్వయంగా గ్రహించడం/అంగీకరించడం ఆయన రాజకీయ చాణక్యతకు నిదర్శనం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేర్పిన నిఖార్సైన నిజం. ఇప్పుడు ఆయన తుప్పు కాదు కాదు వృద్ద నారీ పతివ్రత/సతివ్రత కూడా! అందుకే రాష్ట్రం నవ్య ఆంధ్ర కాబోతుంది అంటూ విజయసాయి రాసారు.