Janasena Pawan Kalyan : గన్నవరం చేరుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్.. ఏ ఏ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటారంటే ?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎయిర్ట్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన పవన్‌ అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలు దేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పవన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - May 25, 2023 / 03:21 PM IST

Janasena Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈరోజు ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌కు చేరుకున్నారు. కాసేపటి క్రితం ఎయిర్ట్‌ పోర్ట్‌లో ల్యాండ్‌ అయిన పవన్‌ అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలు దేరారు. జనసేన పార్టీ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన భవనాన్ని పవన్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అలాగే అక్కడి నుంచి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి పవన్ హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ ప్రైవేట్‌ కార్యక్రమం ఏమై ఉంటుందన్ని ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అందులోనూ పర్యటనపై మీడియాకి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఏదేనా రహస్య భేటీలు ఉండొచ్చన్న చర్చ జరుగుతుంది. దీంతో పవన్ కళ్యాణ్ పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది.