Jc Divakar Reddy : కొత్త వివాదానికి తెరలేపిన జేసీ దివాకర్ రెడ్డి.. రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ !

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని.. సీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 09:40 AM IST

Jc Divakar Reddy : మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని కోరుతూ కొత్త వివాదానికి తెరలేపారు. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని.. సీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు. అదే విధంగా తమ వాళ్లు అంతా  ప్రత్యేక రాయలసీమ కావాలని కోరుతున్నారని.. అలా జరిగిన మంచిదేనని అన్నారు. ప్రస్తుతం జేసీ చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి.