Manchu Vishnu : ‘కన్నప్ప’ షూటింగ్ లో గాయపడ్డ మంచు విష్ణు.. ఏం జరిగిందంటే.

నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'కన్నప్ప'  చిత్రం  షూటింగ్ లో గాయపడ్డారు. కన్నప్ప చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు దగ్గరి నుండి షాట్‌లను తీయడానికి ఉపయోగించే డ్రోన్ అతని చేతిని గాయపరిచింది. దీనితో వెంటనే అతడని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

  • Written By:
  • Publish Date - October 29, 2023 / 07:17 PM IST

Manchu Vishnu : నటుడు మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’  చిత్రం  షూటింగ్ లో గాయపడ్డారు. కన్నప్ప చిత్రం షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నప్పుడు దగ్గరి నుండి షాట్‌లను తీయడానికి ఉపయోగించే డ్రోన్ అతని చేతిని గాయపరిచింది. దీనితో వెంటనే అతడని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సిగ్నల్ వ్యత్యాసం కారణంగా..(Manchu Vishnu)

డ్రోన్ బ్లేడ్లు అతన్ని తీవ్రంగా గాయపరచడంతో విష్ణు చేతికి గాయాలు అయ్యాయి. సిగ్నల్ వ్యత్యాసం కారణంగా డ్రోన్ ఆపరేటర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో డ్రోన్ విష్ణ చేతిని ఢీకొట్టింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఘటనతో సినిమా షూటింగుకు ఆగిపోయింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాం. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత, అతను విశ్రాంతి తీసుకోవడానికి మరియు పూర్తిగా కోలుకోవడానికి తన షెడ్యూల్ నుండి కొంత  విరామం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. కన్నప్పలో ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, నయనతార, మధు బాల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్టీఫెన్ దేవస్సీ మరియు మణిశర్మ సంగీతం సమకూర్చారు.