Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం లక్నో-బహ్రాయిచ్‌ హైవేపై బహ్రాయిచ్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్‌ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు ఉదయం లక్నో-బహ్రాయిచ్‌ హైవేపై బహ్రాయిచ్‌ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్‌ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఉదయం 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్‌ పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు ఉత్తరప్రదేశ్‌ పోలీసులు. అయితే రోడ్డుపై మంచు తీవ్రంగా కమ్ముకోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: పదో తరగతి విద్యార్థినిపై స్నేహితుల గ్యాంగ్ రేప్.. వీడియో తీసిమరీ..!