Prime9

Gautam Gambhir: ఆస్ట్రేలియాను ఓడించకపోతే భారత్ ప్రపంచ కప్ గెలవదు.. గౌతమ్ గంభీర్

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డేలు ఆడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తొలి టీ20కి ముందు భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించకపోతే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవలేదని అన్నాడు.

ఇది ఇంతకు ముందు చెప్పాను, మళ్లీ చెబుతున్నాను. ఆస్ట్రేలియాను ఓడించకపోతే భారత్ ప్రపంచకప్ గెలవదు. నా ఉద్దేశ్యం 2007 టీ20 ప్రపంచ కప్ చూడండి, మేము సెమీ-ఫైనల్‌లో వారిని ఓడించాము. 2011 వన్డే ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్స్‌లో వారిని చిత్తు చేశాం. ఆస్ట్రేలియా అత్యంత పోటీతత్వ జట్లలో ఒకటి. మీరు ఏదైనా పోటీలో గెలవాలంటే మీరు వారిని ఓడించాలని గంభీర్ అన్నాడు.

T20 ప్రపంచ కప్ 2022కి ముందు, రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఆరు టీ20 మ్యాచులు ఆడుతుంది. వీటిలో ఆస్ట్రేలియాతో మూడు మరియు దక్షిణాఫ్రికాతో మూడు ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar