Site icon Prime9

BCCI Key Decision: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు క్యాన్సిల్

BCCI

BCCI

BCCI Sensational Decision on  Pakistan Cricket after Pahalgam Terror attack: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 28 మంది టూరిస్టులను ఉగ్రవాదులు హతమార్చారు. పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులు చంపొద్దని ఎంత వేడుకున్నా మతం పేరు అడిగి మరి దారుణానికి ఒడిగట్టారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఎట్టి పరిస్థితుల్లో పాకిస్థాన్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉండగా, భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య 2012-13 ఏడాదిలో ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇటీవల ఐసీసీ నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. తాజాగా, పహల్గాహ్ ఉగ్రదాడి ఘటనతో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించవద్దని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

భారత్.. చివరిసారిగా పాకిస్థాన్‌కు 2008లో పర్యటించగా.. ఆ సమయంలో భారత్ ఆసియా కప్‌లో ఆడింది. అయితే 2008లో ముంబైలో ఉగ్రదాడి జరిగింది. ఆ తర్వాత నుంచి భారత్.. పాకిస్థాన్ వెళ్లడం లేదు. కానీ ఐసీసీ కారణంగా పాకిస్థాన్‌తో కొన్ని వేదికట్లో ఆడతున్నట్లు తెలిపారు. అయితే ఇక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్న విషయంపై ఐసీసీకి అవగాహన ఉంటుందని అనుకుంటున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అన్నారు.

 

Exit mobile version
Skip to toolbar