Minister KTR: దిగొచ్చిన కేంద్రం.. 13 ప్రాంతీయ భాష‌ల్లో సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ ప‌రీక్ష‌లు

Minister KTR: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, అధికారిక ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

Minister KTR: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, అధికారిక ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా లేఖ రాశారు. దీనిపై తాజాగా కేంద్రం దిగివచ్చింది. 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

దిగివచ్చిన కేంద్రం..

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షను ఇంగ్లీషు, హిందీతో పాటు తెలుగు, అధికారిక ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా లేఖ రాశారు. దీనిపై తాజాగా కేంద్రం దిగివచ్చింది. 13 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఇంగ్లీషు, హిందీలో కేంద్రీయ పోటీ పరీక్షలు నిర్వహించడం వల్ల ఇంగ్లీషు మీడియంలో చదవని, హిందీ మాట్లాడే రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

ఈ మేరకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర ప్రాంతీయ భాష‌ల్లోనూ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలుగు, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాష‌ల్లో 2024 జనవరి 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం త‌న‌ ప్రకటనలో పేర్కొన్న‌ది.

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ల‌ను కేవ‌లం ఇంగ్లీష్‌, హిందీ భాష‌ల్లో నిర్వ‌హించి.. ఇత‌ర ప్రాంతీయ భాష‌ల అభ్య‌ర్థుల భ‌విష్య‌త్తును గంద‌ర‌గోళంలోకి నెట్టివేస్తున్న‌ట్లు ఇటీవ‌ల త‌న లేఖ‌లో కేటీఆర్ పేర్కొన్నారు.

కాంపిటీటివ్ పరీక్ష‌ల‌ను కేవ‌లం హిందీలోనే నిర్వ‌హించ‌డం అది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధ‌మ‌ని, ఎందుకంటే దేశంలో ఎన్నో అధికార భాష‌లు ఉన్నాయ‌ని కేటీఆర్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

సీఆర్పీఎఫ్ నోటిఫికేష‌న్ ప్ర‌జ‌ల హ‌క్కుల్ని హ‌రిస్తోంద‌ని, రాజ్యాంగం ఇచ్చిన స‌మాన‌త్వ అవకాశాల‌ను ఇత‌ర ప్రాంత ప్ర‌జ‌లు కోల్పోతున్న‌ట్లు కేటీఆర్ త‌న లేఖ‌లో తెలిపారు.

సీఎం కేసీఆర్ కూడా ఇదే అంశంపై 2020, న‌వంబ‌ర్ 18వ తేదీన కేంద్రానికి లేఖ రాసిన‌ట్లు కూడా చెప్పారు.