Flight Ticket prices: మణిపూర్ నుంచి బయలుదేరే విమానాల టిక్కెట్లు రేట్లు ఐదు రెట్లు పెరిగాయి.. ఎందుకో తెలుసా?

రిజర్వేషన్ల కారణంగా హింసాత్మక ఘటనలు రేగిన మణిపూర్ నుండి వందలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రయాణీకుల డిమాండ్ పెరిగిపోవడంతో ఇండిగో మరియు ఎయిర్ ఏషియాతో సహా పలు విమానయాన సంస్థలు తమ ఛార్జీలను పెంచాయి.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 01:11 PM IST

Flight Ticket prices: రిజర్వేషన్ల కారణంగా హింసాత్మక ఘటనలు రేగిన మణిపూర్ నుండి వందలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ నేపధ్యంలో ప్రయాణీకుల డిమాండ్ పెరిగిపోవడంతో ఇండిగో మరియు ఎయిర్ ఏషియాతో సహా పలు విమానయాన సంస్థలు తమ ఛార్జీలను పెంచాయి.

టిక్కెట్ల ధరలు ఎలా పెరిగాయంటే.. (Flight Ticket prices)

సాధారణంగా, ఇంఫాల్ మరియు కోల్‌కతా మధ్య విమాన ఛార్జీలు వన్-వేలో ప్రయాణించే వ్యక్తికి రూ. 2,500 నుండి రూ. 5,000 వరకు ఉంటుంది. ఇంఫాల్ నుండి గౌహతి వెళ్లే విమానానికి కూడా ఇదే ఛార్జీ వర్తిస్తుంది. , ఇంఫాల్ నుండి కోల్‌కతాకు దూరం 615 కిలోమీటర్లు, ఇంఫాల్ నుండి గౌహతికి 269 కిలోమీటర్లు.అయితే మే 3న మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి ఇంఫాల్ నుంచి కోల్‌కతాకు విమాన ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఈ మార్గంలో వన్‌వే ప్రయాణానికి ప్రస్తుత ఛార్జీ రూ.12,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది. అదే సమయంలో ఇంఫాల్ నుంచి గౌహతి వెళ్లేందుకు వన్‌వే టికెట్ ధర రూ.15,000కి పెరిగింది.

టిక్కెట్ బుకింగ్ వెబ్‌సైట్‌ల ప్రకారం, ఇంఫాల్ నుండి కోల్‌కతా మరియు ఇంఫాల్ నుండి గౌహతి వరకు వన్-వే టిక్కెట్ ధరలు మే 12 వరకు రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్య ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రజలను స్వదేశానికి తరలించడానికి సమయంతో పోటీపడుతున్నందున, ఇంఫాల్ మరియు కోల్‌కతా మధ్య కొన్ని అదనపు విమానాలు నడుపుతున్నాయి.