Prime9

Sukesh Chandrasekhar: సత్యేందర్ జైన్ 20 మిలియన్ డాలర్లను రూపాయిలు, బిట్ కాయిన్లలో మార్చమన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్ మరో లేఖ

New Delhi: మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్‌కు సంబంధించి మరో లేఖ విడుదల చేసాడు. 2017 ఫిబ్రవరిలో తెల్లవారుజామున 2 గంటలకు జైన్ తనకు 20 మిలియన్ డాలర్లు భారతీయ రూపాయిలు మరియు బిట్‌కాయిన్‌గా మార్చడానికి సహాయం కోరుతూ తనకు ఫోన్ చేసినట్లు పేర్కొన్నాడు. బెంగళూరులో ప్రసిద్ధ డిస్టిలరీని నడుపుతున్న తన వ్యాపార సహచరుల నుండి డబ్బు వసూలు చేయాలని జైన్ తెలిపాడని సుకేష్ వెల్లడించాడు. ఈ మొత్తాన్ని ఆప్‌కి ఇస్తున్నట్లు పేర్కొన్న జైన్, సదరు మొత్తాన్ని మార్చి ఉదయం 11 గంటలలోపు ఢిల్లీకి పంపించాలని పట్టుబట్టారు.

చంద్రశేఖర్ ఆ పని చేయలేకపోవడంతో డబ్బు వసూలు చేసి బెంగళూరులోని నగల దుకాణానికి అప్పగించమని అడిగారు. ఆ తర్వాత, తన బెంగళూరు కార్యాలయ సిబ్బంది దీనికి పైన పేర్కొన్న మొత్తం ఉన్న 4 బ్యాగులను నగల దుకాణానికి డెలివరీ చేసినట్లు సుకేష్ తన లేఖలో చెప్పాడు. తన కథకు మద్దతుగా తన వద్ద సందేశాలు ఉన్నాయని తెలిపాడు. సీబీఐ విచారణకు అంగీకరించాల్సిందిగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను సుకేష్ సవాలు చేశాడు.

ఈ లేఖ పై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ ఈ ఆరోపణలన్నీ చాలా తీవ్రమైనవన్నారు. ఆరోపణలు నిజం కాకపోతే, కేజ్రీవాల్‌తో పాటు సత్యేందర్ జైన్ మరియు కైలాష్ గహ్లాట్ పేర్లు బయటకు వచ్చిన లై డిటెక్టర్ పరీక్షకు ఎందుకు ముందుకు రారని ప్రశ్నించారు. 5 నెలలుగా బెయిల్‌ రాని సత్యేందర్‌ జైన్‌ ను మంత్రిగా కొనసాగించడంలో అంతర్యమేమిటని నిలదీసారు.

Exit mobile version
Skip to toolbar