Rahul Gandhi Launched: కర్ణాటకలో ‘గృహ లక్ష్మి’ పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలోని మైసూరులో 'గృహ లక్ష్మి' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ ఇంటి పెద్దలుగా ఉన్న దాదాపు 1.1 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ.2,000 సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

  • Written By:
  • Publish Date - August 30, 2023 / 03:54 PM IST

Rahul Gandhi Launched:కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలోని మైసూరులో ‘గృహ లక్ష్మి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ ఇంటి పెద్దలుగా ఉన్న దాదాపు 1.1 కోట్ల మంది మహిళలకు నెలవారీ రూ.2,000 సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మహిళలు చెట్లవేర్ల లాంటివారు..(Rahul Gandhi Launched)

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పునాది మరియు శక్తి మహిళలని అన్నారు. ఐటి రంగం మరియు ఇతర రంగాలలో కర్ణాటక సాధించిన విజయాల వెనుక కీలకం మహిళలే అని రాహుల్ పేర్కొన్నారు. మహిళలు రాష్ట్రానికి బలం. వారు చెట్ల వేర్ల లాంటివారు. వారి సహకారం కనిపించదు కానీ రాష్ట్రానికి నిజమైన పునాది వారే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో దాదాపు అన్ని ఎన్నికల హామీలను అమలు చేసిందన్నారు.

గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానకి కారణమయిన ఎన్నికల హామీలలో ‘గృహ లక్ష్మి’ పథకం ఒకటి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘గృహలక్ష్మి’ పధకానికి ప్రభుత్వం రూ.17,500 కోట్లు కేటాయించింది. మిగిలిన ఎన్నికల హామీలలో శక్తి’, ‘గృహ జ్యోతి’, ‘అన్నభాగ్య, యువనిధి పధకాలు ఉన్నాయి. వీటిలో యువ నిధి’ (యువ నిధి) 2022-23లో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఆరు నెలల తర్వాత కూడా ఉద్యోగం పొందలేకపోయిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు మరియు డిప్లొమా హోల్డర్‌లకు వరుసగా నెలకు రూ. 3000 మరియు రూ. 1,500 ఇస్తామని హామీ ఇచ్చింది. డిసెంబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.