Site icon Prime9

18 Maoists Surrendered: లొంగిపోయిన 18 మంది మావోలు.. 10 మందిపై రూ. 38 లక్షల రివార్డ్

Naxals

Naxals

18 Maoists Surrendered in Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లో 18 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ను కలిసి లొంగిపోతున్నట్టు తెలిపారు. వీరంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో చురుకుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. లొంగిపోయిన మావోల్లో 10 మందిపై రూ. 38 లక్షల రివార్డ్ ఉన్నట్టు ప్రకటించారు.

 

ఈ సందర్భంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్స్ రహిత గ్రామ పంచాయతీ పథకంలో భాగంగా తాము సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు. అయితే లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం తరపున అందాల్సిన రివార్డు, వారికి కావల్సిన సదుపాయాలను అందిస్తామని చెప్పారు. ఇటీవల కేంద్రం ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్ లో పోలీసులు పెద్ద సంఖ్యలో మావోయిస్టులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలోనే నేడు 18 మావోలు లొంగిపోతున్నట్టు ప్రకటించారు.

 

Exit mobile version
Skip to toolbar