Site icon Prime9

Pakistan attack at Srinagar Airport: పాక్‌కు నిధులు విడుదల.. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు

Srinagar

Srinagar

Pakistan Drone attack at Srinagar Airport: భారత్, పాక్ సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. భింబర్ నుంచి భారీ ఆర్టలరీ కాల్పులు జరుగుతున్నాయి. పంజాబ్‌లోని ఫాజిల్ సరిహద్దులో కాల్పులు చోటుచేసుకున్నాయి. పాక్ సైనం కాల్పులను భారత బలగాలు తిప్పికొడుతున్నాయి.

 

తాజాగా, శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. జనావాసాలే టార్గెట్‌గా పేలుళ్లు జరిపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీనగర్‌లో సైరన్లు మోగుతున్నాయి.ప్రజలను భారత ఆర్మీ అప్రమత్తం చేస్తుంది. ఇదిలా ఉండగా, ఉదయం 11.45 నిమిషాల సమయంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పేలుడు శబ్దాలతో ప్రజలు వణికిపోతున్నారు.

 

అంతకుముందు తెల్లవారుజామున ఇదే తరహాలో పేలుడు సంభించినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే జమ్మూలోని ప్రముఖ శంబు ఆలయంపై డ్రోన్‌తో దాడి చేసింది. ఈ దాడుల్లో ధ్వంసమైన ఆలయ దృశ్యాలను రక్షణ శాఖ విడుదల చేసిది. మన దేశ సార్వభౌమత్వాన్ని రక్షించుకునేందుకు సాయుధ బలగాలు కృత నిశ్చయంతో ఉన్నాయి స్పష్టం చేసింది.

 

ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్ నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఇబ్బందుల్లో ఉన్న ఆ దేశానికి 1 బిలియన్ డాలర్లు అనగా ఇండియన్ కరెన్సీ ప్రకారం… రూ.8,500కోట్లు మంజూరు చేసింది. అయితే, ఈ నిధులపై పలు ఆంక్షలు విధించినట్లు సమాచారం.

 

Exit mobile version
Skip to toolbar