Prime9

India Pakistan War: అమృత్‌సర్‌లో డ్రోన్ల కూల్చివేత.. పంజాబ్‌లో రెడ్ అలర్ట్.. బయటకు రావొద్దని.. హెచ్చరిక!

High Alert In Punjab: పంజాబ్‌లో రెడ్ అలర్ట్ చేసింది. బఠిండాలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, అమృత్‌సర్‌లో డ్రోన్ దాడికి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్ దాడిని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఖాసా కంటోన్మెంట్ ప్రాంతంలో పాక్ డ్రోన్ల కూల్చివేసింది. కాగా, ఇవాళ తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ గగనతంలో శత్రు డ్రోన్‌ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ తర్వాత దానిని వెంటనే కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది.

 

ఇదిలా ఉండగా, శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై డ్రోన్లతో దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే పలు ప్రదేశాల్లో పేలుళ్లు చోటుచేసుకున్నాయని అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా ఆర్మీ సైన్యం తిప్పికొట్టింది.

 

మరోవైపు, అమృత్‌సర్‌లో క్షిపణి శకలాలు లభ్యమయ్యాయి. పాక్ డ్రోన్లతో దాడికి యత్నించగా.. భారత్ ఆర్మీ తిప్పికొట్టింది. ఈ శకలాలు పంజాబ్‌లో ఉన్న ఫిరోజ్‌పుర్ ఇంటి పరిసరాల్లో కూడా డ్రోన్లతో దాడులు చేయగా.. పలువురు గాయపడ్డారు. దీంతో వెంటనే వారిని సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా జమ్మూలో ఓ ఆలయ సమీపంలోనూ పాక్ క్షిపణికి చెందిన శకాలు లభించాయి.

 

ఈ దాడులతో కేంద్రం అప్రమత్తమైంది. ఉత్తర, పశ్చిమ భారత్‌లో విమానాశ్రయాలను కేంద్రం మూసివేసింది. మొత్తం 32 విమానాశ్రయాలను మూసివేయగా.. ఈ మేరకు ఈనెల 15 వరకు మూసివేస్తునట్లు ఆదేశాలు జారీ చేసింది. అలాగే పాక్ కీలక ప్రకటన చేసింది. తమ గగనతలంను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

 

Exit mobile version
Skip to toolbar