Prime9

India Hits Pakistan Terrorist Camps: పాక్‌పై ప్రతీకారం.. భారత్ మెరుపు దాడిలో ధ్వంసమైన ఉగ్రవాదుల స్థావరాలు ఇవే!

India Hits Pakistan Nine Terrorist Camps: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడిలో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

 

ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. పాకిస్థాన్‌లో ఉన్న 4 ప్రదేశాలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 5 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మే 7 బుధవారం 1.30 నిమిషాలకు దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా.. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పాక్ ఆర్మీపై ెలాంటి దాడులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.

 

9 ప్రాంతాలు ఇవే..
1.బహావల్ పూర్
2. మురిడ్కే
3. గుల్ పూర్
4. లష్కర్ క్యాంప్ సవాయి
5. బిలాల్ క్యాంప్
6. కోట్లీ
7. బర్నాలా క్యాంప్
8. సర్జల్ క్యాంపు
9. మొహమూనా క్యాంపు

 

Exit mobile version
Skip to toolbar