Kejriwal Appeal: దేశాభివృద్ధికి కరెన్సీ నోట్లపై వినాయక-లక్ష్మీ ల ఫోటోలు అవసరం…ప్రధానికి కేజ్రీవాల్ విజ్నప్తి

దేశ కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫోటోలు కూడా ఉంటే అభివృద్ధికి దోహదపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మంత్రికి విజ్నప్తి చేశారు.

New Delhi: దేశ కరెన్సీ నోట్లపై లక్ష్మీ-గణేశుడి ఫోటోలు కూడా ఉంటే అభివృద్ధికి దోహదపడుతుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మంత్రికి విజ్నప్తి చేశారు.

ఆ దిశగా నోట్లపై మహాత్ముడి బొమ్మతో పాటు రెండో వైపు దేవతామూర్తుల బొమ్మలను ముద్రించండి అంటూ మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఎంత ప్రయత్నం చేసిన్నప్పటికీ, దేవతలు మనల్ని ఆశీర్వదించకపోతే కొన్ని సందర్భాలలో ప్రయత్నాలు ఫలించవని వ్యాఖ్యానించారు. దీనిపై రెండు రోజుల్లో ప్రధానమంత్రికి లేఖ రాస్తానని కేజ్రీవాల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: Ram Janmbhoomi temple: 2024 సంక్రాంతికి.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభం?