Delhi Liquor scam: ఢిల్లీ మద్యం కుంభకోణం లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల నివాసాల్లో ఈడీ దాడులు

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది.

  • Written By:
  • Publish Date - May 24, 2023 / 01:37 PM IST

Delhi Liquor scam: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈరోజు మే 24న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సన్నిహితుల ఇళ్లతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో తాజా సోదాలు, దాడులు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయంలో..(Delhi Liquor scam)

2020లో మద్యం దుకాణాలు మరియు వ్యాపారులకు లైసెన్సులు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సింగ్ మరియు అతని భాగస్వాములు పాలుపంచుకున్నారని, రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని మరియు అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి సర్వేష్ మిశ్రా మరియు అజిత్ త్యాగిల నివాసాలతో సహా ఆరు ప్రదేశాలలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. వారిద్దరూ ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌కు కీలక సహచరులని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు ఈ దాడులకు సంబంధించి సంజయ్ సింగ్ ట్వట్టర్ లో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేసారు.

ఈడీ నిజస్వరూపాన్ని బయటపెడతాను..

ప్రధాని మోదీ ఈడీ నియంతృత్వాన్ని, గూండాయిజాన్ని దేశం ముందు బయటపెట్టాను. ఈడీ తన అధికారాన్ని ఏజెన్సీగా దుర్వినియోగం చేస్తోంది. మద్యం కుంభకోణంలో వివిధ వ్యక్తుల ప్రమేయాన్ని మోసపూరితంగా రుజువు చేస్తోంది. వారు నాకు వ్యతిరేకంగా ఏ ఆధారాలు సంపాదించలేకకపోయారు. ఇప్పుడు వారు నా సహాయకులపై దాడి చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నా సహచరులు అజిత్ త్యాగి, సర్వేష్ మిశ్రా ఇళ్లపై దాడులు జరిగినట్లు తెలిసింది. ప్రధాని మోదీ ప్రభుత్వం లేదా ఈడీ పన్నిన ఎలాంటి కుట్రకు వ్యతిరేకంగా నేను రాజీపడను. మేము మీకు వ్యతిరేకంగా పోరాడుతాము. దేశం ముందు మిమ్మల్ని బహిర్గతం చేస్తాము. ఈడీ ఎలా దుర్వినియోగం అవుతుందో నేను బయటపెడతాను. సుప్రీంకోర్టు, హైకోర్టు జోక్యం చేసుకున్నా మా పోరాటం కొనసాగుతుందని సంజయ్ సింగ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఈ విచారణకు సంబంధించి తనపై తప్పుడు మరియు అవమానకరమైన వాదనలు చేసినందుకు ఈడీ డైరెక్టర్ మరియు మద్యం పాలసీ కేసుకు సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్ మరియు దర్యాప్తు అధికారిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి కోరుతూ రాజ్యసభ ఎంపీ కొంతకాలం క్రితం కేంద్ర ఆర్థిక కార్యదర్శికి లేఖ రాశారు.