Young Stars ready to join in Army amid India Vs Pakistan War: భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ దాడికి ప్రతీకార చర్యగా భారత్ పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకపడుతోంది. వాటిని భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలపై ఎటాక్ చేస్తోంది. అలాగే విచక్షణారహితంగా కాల్పులు జరుపుతోంది. వీటన్నిటీని భారత సైన్యం నిర్వీర్యం చేస్తోంది.
అయితే యుద్ధం నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పౌరసేవలు, దేశ ప్రజల రక్షణ కోసం ప్రభుత్వాలు అవగాహన కోసం మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. అయితే రానున్న రోజుల్లో ప్రజల రక్షణ కోసం స్వచ్ఛందంగా సేవ చేసేందుకు కాను చండీఘడ్ కార్పోరేషన్ ప్రత్యేక చర్యలు తీసుకుంది. సాధారణ పరిపాలన, పౌరసేవల కోసం… జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో సేవల కోసం చండీఘఢ్ కార్పొరేషన్ ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. చండీఘడ్ డిప్యూటీ కమిషనర్ ప్రకటనతో ఠాగూర్ థియేటర్ కు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భారీగా క్యూలైన్లు కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భారత సైన్యానికి మద్దతు ఇవ్వడానికి తాము ఇక్కడికి వచ్చామని యువత తెలిపింది.
సైన్యం మన కోసం చాలా చేస్తోంది. మనం కూడా సైన్యానికి అండగా నిలవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. పాకిస్తాన్ నిరంతర రెచ్చగొట్టే చర్యలకు ధైర్యంగా ప్రతిస్పందిస్తున్న మన సైనికులతో మనమందరం నిలబడాలని కోరారు. దేశం కోసం యువత పెద్ద సంఖ్యలో తరలిరావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ రక్షణ కోసం కేంద్రం తీసుకుంటున్న చర్యలకు మద్దతు తెలిపారు. ఉగ్రవాదం అంతమొందించేందుకు తమ వంతు సాయం చేస్తామని వెల్లడించారు.
#WATCH | Huge lines seen in Chandigarh when local announcements were made for volunteers to aid in the assistance. pic.twitter.com/Q7YXWRg50J
— ANI (@ANI) May 10, 2025