New Delhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆదివారం న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో (రీసెర్చ్ అండ్ రిఫరల్) కంటిశుక్లం ( కాటరాక్ట్) శస్త్రచికిత్స విజయవంతమైందని రాష్ట్రపతి భవన్ అధికార ప్రతినిధి తెలిపారు. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు (అక్టోబర్ 16, 2022) ఆర్మీ హాస్పిటల్ (రిఫరల్ & రీసెర్చ్), న్యూఢిల్లీలో కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. శస్త్రచికిత్స విజయవంతమైంది మరియు ఆమె ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యిందని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ముర్ము, జూలై 25, 2022న భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు.
President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాటరాక్ట్ సర్జరీ

Draupadi Murmu