Prime9

Singareni Elections: సింగరేణి ఎన్నికలను వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు

Singareni Elections: తెలంగాణ హైకోర్టు బుధవారం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సిసిఎల్ )లో గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్ ఎన్నికలను డిసెంబర్ 27 కి వాయిదా వేసింది. ఎస్‌సిసిఎల్ చేసిన అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత హైకోర్టు తన తీర్పును వెలువరించింది. నవంబర్ 30లోగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది.

సింగిల్ బెంచ్ తీర్పు..(Singareni Elections)

తొలుత, అక్టోబర్ 28న ఎస్‌సిసిఎల్ లో గుర్తింపు  కార్మిక సంఘం ఎన్నికలకు కేంద్ర కార్మిక శాఖ ఏర్పాట్లు చేసింది. అయితే, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని ఎస్‌సిసిఎల్ హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పటివరకు ఎస్‌సిసిఎల్ ఎన్నికలు మూడుసార్లు వాయిదా పడ్డాయి. జూన్ 30న తెలంగాణ హైకోర్టు ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌సిసిఎల్‌ యాజమాన్యాన్ని ఆదేశించింది. సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఎస్‌సిసిఎల్‌ యాజమాన్యం హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఎన్నికలకు సంబంధించిన విధుల్లో అధికారులందరూ పాల్గొంటారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని ఎస్‌సిసిఎల్ యాజమాన్యం హైకోర్టును అభ్యర్థించింది.

ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, TBGKS సంఘం వారి స్వార్థం కోసమే వాయిదా వేయించారని ఏఐటియుసి నేతలు అన్నారు. ఇప్పుడు గుర్తింపు సంఘం ఎన్నికల్లో TBGKS ఓటమి పాలైతే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోతామని ఎన్నికల వాయిదా వేయించారన్నారు. కేవలం ఎన్నికలు వాయిదా పడ్డాయి తప్ప, అసెంబ్లీ సింగరేణి ఎన్నికల్లో వారు ఓడడం ఖాయమని రాష్ట్రంలో సింగరేణిలో కాషాయ జెండా ఎగరడం ఖాయమంటున్నారు.

Exit mobile version
Skip to toolbar