Site icon Prime9

Pawankalyan on Navaratnalu: నవరత్నాల పై నవ సందేహాలు.. పవన్ కళ్యాణ్!

Prime9news

Pawankalyan

Pawankalyan Sensational Commnets on YSRCP’s Navaratnalu Scheme: వైసీపీ ప్రవేశపెట్టిన నవరత్నాల పై నవ సందేహాలు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ట్వీట్  చేశారు.

మొదటి రత్నం: రైతు భరోసా 64 లక్షల మందికి మేలు అని చెప్పి, 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా, మూడళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 700 మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా

 

రెండో రత్నం: అమ్మ ఒడి, అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి, 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు.

 

మూడో రత్నం: పెన్షన్లు, పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా.

 

నాలుగో రత్నం: సంపూర్ణ మద్యపాన నిషేధం. మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు, 2021-22లో రూ.22 వేల కోట్లు, ఇదేనా మధ్య విధం ఈ ఆదాయం చూపించే రూ. 8వేల కోట్ల బండ్లు అమ్మలేదా,

 

అయిదో రత్నం: జల యజ్ఞం, పోలవరం ప్రాజెక్టును ‘యుద్ధ ప్రాతిపదిక’ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా,

 

ఆరో రత్నం: ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి. సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు.

 

ఏడో రత్నం: ఫీజు రీయింబర్స్మెంట్.. రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా, పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు.

 

ఎనిమిదో రత్నం: పేదలందరికీ ఇళ్ళు, చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు.

 

తొమ్మిదో రత్నం: ఆసరా పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు. అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి అంటూ పవన్ ట్వీట్ చేశారు.

 

Exit mobile version
Skip to toolbar