Vishnu Vardhan Reddy: కడప జిల్లావాసులకు జగన్ క్షమాపణ చెప్పాలి.. భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి

సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకివదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు.

Amaravati: సొంతజిల్లా అభివృద్ధిని గాల్లోకి వదిలేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లావాసులకు క్షమాపణ చెప్పాలని భాజపా నేత విష్ణువర్ధన రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, సొంత జిల్లాకే న్యాయం చేయలేని వ్యక్తి, రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు.

భాజపా, జనసేన సంబంధాలను విడగొట్టడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రచారం కోసం తపించేవాడని కొట్టిపారేశారు. ఆర్జీవి లాంటి పిచ్చొడికి రాయి ఇస్తే మనమీదే పడుతుందని విష్ణువర్దన రెడ్డి హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Janasena Party: ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణం 8 శాతానికే పరమితం.. జనసేన పార్టీ