Prime9

AP Journalists : ఏపీలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. నిబంధనలు ఏంటంటే ?

AP Journalists : ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించనున్నట్లు జగన్ సర్కార్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలు వెలువరించింది. అందులో భాగంగా ఏపీలో ప్రతీ జర్నలిస్టుకు మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం. అలానే 60:40 శాతం చెల్లింపు పద్దతిలో ఇళ్ల స్థల కేటాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

జిల్లా ఇంచార్జ్ మంత్రి నేతృత్వంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు కమిటీలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించింది ప్రభుత్వం. అయితే ఆ కమిటీలో జర్నలిస్టులకు (AP Journalists) సభ్యులుగా అవకాశం కల్పించనుంది. ఇళ్ల స్థలాల కోసం జర్నలిస్టులు ఆన్ లైన్‌లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌ సైట్‌ను రూపొందించి.. 45 రోజుల్లోగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 

 

అర్హతగల గుర్తింపు పొందిన జర్నలిస్టుల జాబితాను సంబంధిత జిల్లా కలెక్టర్‌లకు అందజేయాలి. అటువంటి అభ్యర్థనలను స్వీకరించిన తర్వాత, జిల్లా స్థాయి కమిటీలు అటువంటి జర్నలిస్టులకు కేటాయింపు కోసం ఇంటి స్థలాలకు సరిపోయే భూమిని గుర్తిస్తాయి. జర్నలిస్ట్ పనిచేస్తున్న / నివసిస్తున్న జిల్లాలోనే ఇంటి స్థలాలను కేటాయించవచ్చు. జర్నలిస్ట్ పనిచేస్తున్న / నివసిస్తున్న మండలంలో కేటాయింపులకు ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

నిబంధనలు ఏంటంటే.. 

Exit mobile version
Skip to toolbar