Site icon Prime9

Jacqueline: జాక్వెలిన్ దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నించింది.. ఈడీ ఆరోపణ..

Jacqueline

Jacqueline

Jacqueline: రూ.200 కోట్ల దోపిడీ కేసులో నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్‌పై విచారణ జరుగుతుండగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారత్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టుకు తెలిపింది. ‘ఫెర్నాండెజ్ విచారణకు ఎప్పుడూ సహకరించలేదని ఆమె బెయిల్ పిటిషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. జాక్వెలిన్ శనివారం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు హాజరయ్యారు. ఆమె మధ్యంతర బెయిల్‌ను తదుపరి విచారణ వరకు పొడిగించారు. రెగ్యులర్ బెయిల్ కోసం జాక్వెలిన్ చేసిన పిటిషన్‌ను నవంబర్ 10న ఉదయం 10 గంటలకు కోర్టు విచారించనుంది.

కోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఈడీజాక్వెలిన్ రెగ్యులర్ బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించింది .ఆమె తన మొబైల్ ఫోన్ నుండి డేటాను తొలగించడం ద్వారా దర్యాప్తు సమయంలో సాక్ష్యాలను తారుమారు చేసిందని ఆరోపించింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ భారతదేశం నుండి పారిపోవడానికి విఫలయత్నం చేసిందని, అయితే అలా చేయలేకపోయిందని ఈడీ తెలిపింది. విచారణ సమయంలో ఆమె ప్రవర్తన బాగాలేదని, ఆమె సాక్ష్యాలను మరియు సాక్షులను పాడు చేయగలదని తెలిపింది.ఇతర నిందితులతో ముఖాముఖి కూర్చునేలా చేసినపుడు మరియు సాక్ష్యాధారాలు సమర్పించినపుడు ఆమె తన నేరాన్ని అంగీకరించిందని ఈడీ పేర్కొంది.

గత నెలలో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శ్రీలంకకు చెందిన ఫెర్నాండెజ్ తన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌లో, తాను 2009 నుండి భారతదేశంలో నివసిస్తూ పన్ను చెల్లిస్తున్నానని తన ప్రతిష్ట ఈ కేసుతో ముడిపడివుందని పేర్కొంది. ఆగస్ట్ 17, 2022న ఢిల్లీ కోర్టులో సుఖేష్ చంద్రశేఖర్‌పై రూ. 200 కోట్ల దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును నిందితురాలిగా పేర్కొంది. ఈడీ యొక్క మునుపటి ఛార్జ్‌షీట్ ప్రకారం, జాక్వెలిన్ మరియు నోరా ఫతేహి తమకు సుఖేష్ చంద్రశేఖర్ నుంచి బిఎండబ్ల్యు కార్లు లభించాయని పేర్కొన్నారు.

Exit mobile version
Skip to toolbar