Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. పలువురికి గాయాలు

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం సాయంత్రం తన ర్యాలీలో ఒక దుండగుడు కాల్పులు జరపడంతో గాయపడ్డారు.

  • Written By:
  • Updated On - November 3, 2022 / 06:27 PM IST

Pakistan: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం సాయంత్రం తన ర్యాలీలో ఒక దుండగుడు కాల్పులు జరపడంతో గాయపడ్డారు. దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేశారు. గుజ్రన్‌వాలా డివిజన్‌లోని వజీరాబాద్ నగరంలోని జాఫర్ అలీ ఖాన్ చౌక్ సమీపంలో ఖాన్ నిరసన ప్రదర్శన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న కంటైనర్-మౌంటెడ్ ట్రక్కు సమీపంలో కాల్పులు జరిగినట్లు తెలిసింది. నాలుగు బుల్లెట్లు తగిలిన ఖాన్‌ను వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఇస్లామాబాద్‌లో సమాఖ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ కాల్పుల్లో సింధ్ మాజీ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్, ఫైసల్ జావేద్ సహా 15 మందికి పైగా పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు. కాల్పుల తరువాత పిటిఐ కార్యకర్తలు, మరియు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.

ఇమ్రాన్ ఖాన్ తన నిరసన యాత్రను అక్టోబర్ 28న ప్రారంభించిన పార్టీ లాంగ్ మార్చ్, మార్చి 4న ఇస్లామాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా, నిరసన కాన్వాయ్ నవంబర్ 11న చేరుకుంటుందని పీటీఐ నేత అసద్ ఉమర్ తెలిపారు. ఖాన్ ముందస్తు ఎన్నికలను డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత జాతీయ అసెంబ్లీ పదవీకాలం ఆగస్టు 2023లో ముగుస్తుంది. 60 రోజులలోపు తాజా ఎన్నికలు జరగాలి.