Prime9

MS Dhoni: కోలీవుడ్ లోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ

Kollywood: దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ యొక్క ప్రకటనల తయారీ మరియు టీవీ మార్కెటింగ్ కంపెనీ “ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్”(DEPL) సినిమాల ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోందని చాలా కాలం నుండి వార్తలు వస్తున్నాయి. ఈ వెంచర్‌కు సంబంధించి ఇప్పటికే కొంతమంది అగ్ర తారలు మరియు కొంతమంది దర్శకుల పేర్లు బయటకు వచ్చాయి. తాజాగా ఇప్పుడు అధికారికంగా DEPL కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

దీపావళి ముందురోజు, DEPL, “అథర్వ-ది ఆరిజిన్” అనే గ్రాఫిక్ నవలను రచించిన సంగీత స్వరకర్త రమేష్ తమిలమణితో జతకడుతున్నట్లు ప్రకటించింది. ఆయన ఈ తమిళ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. ధోనీ భార్య సాక్షి కథను అందించారని మరియు ఆమె తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మించనుందని తెలుస్తోంది. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా డబ్ చేయబడుతుంది.

ప్రస్తుతానికి, కథ మరియు దర్శకుడు మాత్రమే ఖరారు చేయబడ్డాయి, కానీ టీనటులు లేదా ఇతర సాంకేతిక సిబ్బందిని ఎంపికచేయలేదు చాలా మంది తమిళ పరిశ్రమ వ్యక్తులతో సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన తరువాత, చివరగా ధోని మొదట తమిళ చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అతను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ కెప్టెన్ గా తమిళ ప్రజల అభిమానాన్ని పొందాడు.

Exit mobile version
Skip to toolbar