Gulab Jamun : పెళ్లిలో గులాబ్ జామ్ అయిపోయిందని వధువు బంధువును కత్తితో పొడిచి చంపేసారు

ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఒక వివాహ వేడుకలో గులాబ్ జామ్ అయిపోవడంతో రెండు వర్గాల మద్య జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు

  • Written By:
  • Publish Date - October 27, 2022 / 06:42 PM IST

Crime: ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని ఒక వివాహ వేడుకలో గులాబ్ జామ్ అయిపోవడంతో రెండు వర్గాల మద్య జరిగిన ఘర్షణలో 22 ఏళ్ల వ్యక్తి మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.మొహల్లాలోని షైఖాన్ నివాసి ఉస్మాన్ కుమార్తెల వివాహ వేడుకలో ఈ ఘటన జరిగింది.

గులాబ్ జామ్ అయిపోవడంతో వధువు మరియు వరుడి తరపు బంధువుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ సందర్బంగా ఒక వ్యక్తి హాజరైన వారిపై కత్తితో దాడి చేశాడు.దాడిలో తీవ్రంగా గాయపడిన సన్నీ (22) అనే వ్యక్తిని మొదట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు పంపారు,. ఆపై ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీకి రిఫర్ చేశారు,.అక్కడ అతను చికిత్స పొందుతూ మరణించాడు. అతని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపారు. దాడిలో గాయపడిన ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.