Retired MRO: మాజీ రెవిన్యూ ఉద్యోగి మరో భూభాగోతం

బతికి ఉన్నవాళ్లను చనిపోయిన్నట్లుగా రికార్డుల్లోకి ఎక్కించడం ఆ సార్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అబద్ధాన్ని ఎక్కువ రోజుల దాచలేమని గుర్తించేలేక పోయిన ఆ సార్ చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఆ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొనింది.

Sanga Reddy: బతికి ఉన్నవాళ్లను చనిపోయిన్నట్లుగా రికార్డుల్లోకి ఎక్కించడం ఆ మాజీ సార్ కు వెన్నతో పెట్టిన విద్య. అయితే అబద్ధాన్ని ఎక్కువ రోజుల దాచలేమని గుర్తించేలేక పోయిన ఆ సార్ చివరకు అడ్డంగా దొరికిపోయారు. ఆ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకొనింది.

రాయికోడ్ మాజీ ఎమ్మార్వో రాజయ్య మరో భూభాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. లంచం సొమ్ముకు ఆశపడి బతికి ఉన్న మోహన్ అనే వ్యక్తి చనిపోయిన్నట్లుగా రికార్డుల్లో చూపి 4ఎకరాల భూమికి పట్టా చేసేశారు. అది కాస్తా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మోహన్ ఎమ్మార్వో పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో శివమ్మ అనే మహిళ చనిపోయిన్నట్లుగా చూపి ఎమ్మార్వో రాజయ్య ఏకంగా 28 ఎకరాలు మరొకరికి రిజిష్ట్రేషన్ చేశారు.

ఇది కూడా చదవండి:Governor vs CM: గవర్నర్ ను పిలిచేదెప్పుడు…బిల్లులు పాస్ చేసుకొనేది ఎప్పుడు…అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న కేసిఆర్