BCCI Contracts: బీసీసీఐ గ్రేడ్స్ లో జడ్డూ అప్.. రాహుల్ డౌన్

ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు.

BCCI Contracts: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా క్రికెటర్లకు సంబంధించిన వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. 2023 గాను బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ ఉండనున్నాయి. ఈ గ్రేడ్స్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ‘A’ నుంచి ‘A+’ కేటగిరీకి ప్రమోట్ అయ్యాడు. కాగా, జడేజాకు ప్రమోషన్ దక్కగా గత కొంతకాలంగా పేలవ ఫామ్ తో విఫలమవుతున్న కేఎల్ రాహుల్ ను డిమోషన్ లభించింది. గత ఏడాది ఏ గ్రేడ్ లో ఉండగా.. ప్రస్తుతం ‘B’ కి పడిపోయాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రాలు ‘ఎ ప్లస్ ’ గ్రేడ్ లోనే కొనసాగుతున్నారు.

టీమిండియా టీ20 లకు సారథిగా వ్యవహరిస్తున్న హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు కూడా ‘ఎ’ గ్రేడ్ దక్కించుకున్నారు. ఇక రిషబ్ పంత్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ కూడా ‘ఎ’ కేటగిరీలోనే ఉన్నారు. వాస్తవానికి జడేజాకు ‘ఎ ప్లస్’ కాంట్రాక్టు ఇవ్వాలని గత రెండేండ్లుగా అనుకుంటున్నా గాయాల కారణంగా అతడు తరుచూ జట్టుకు దూరమవడం కారణంగా బీసీసీఐ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ ట్రోఫీలో జడ్డూ కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. దీంతో జడ్డూ గ్రేడ్స్ లో మార్పులు చోటు చేసుకున్నాయి.

 

కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్(BCCI Contracts)

ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ తో అరంగేట్రం చేసిన ఆంధ్ర వికెట్ కీపర్ కేఎస్ భరత్ కు తొలిసారి బీసీసీఐ గ్రేడ్ దక్కింది. కేఎస్ భరత్ సీ గ్రేడ్ తో కాంట్రాక్ట్ దక్కంచుకున్నాడు. ఇక గాయంతో చాలాకాలం క్రికెట్ కు దూరంగా ఉంటున్న బుమ్రా, రిషభ్ పంత్ లు తమ కాంట్రాక్టులను నిలుపుకున్నారు. మొత్తంగా గ్రేడ్ ఎ ప్లస్ లో నలుగురు క్రికెటర్లు ఉండగా.. ‘ఎ’లో ఐదుగురు ఉన్నారు. గ్రేడ్ ‘బి’లో ఆరుగురు ఉండగా ‘సి’లో 11 మంది ఉన్నారు. కాగా ఈసారి గ్రేడ్ ‘సి’లో ఉన్న శాంసన్.. ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ తొలిసారి బీసీసీఐ కాంట్రాక్టు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని బ్యాకప్ ప్లేయర్లుగా ఉన్నవారికే కాంట్రాక్టులు దక్కాయి. దీపక్ చహర్, ఉమ్రాన్ మాలిక్ లాంటి వర్ధమాన ఆటగాళ్లకు ఈసారి నిరాశే ఎదురైంది. మరో వైపు సీనియర్ ప్లేయర్స్ అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లు తమ కాంట్రాక్ట్ లు కోల్పోయారు.

 

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు వివరాలు

Grade A+: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ( ఎ+ గ్రేడ్ లోని ఆటగాళ్లు రూ. 7 కోట్లు)

Grade A: హార్ధిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రిషబ్ పంత్, మహ్మద్ షమీ, అక్షర్ పటేల్ ( ఎ గ్రేడ్ లోని ఆటగాళ్లు రూ. 5 కోట్లు)

Grade B: ఛతేశ్వర్ పుజారా, కెఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ ( బీగ్రేడ్ లోని ఆటగాళ్లు రూ. 3 కోట్లు)

Grade C: శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్ ( సీ గ్రేడ్ లోని ఆటగాళ్లకు రూ. 1 కోటి)