Site icon Prime9

Sonia Gandhi: మెడికల్ చెకప్ కోసం విదేశాలకు సోనియాగాంధీ

New Delhi: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఆమె వెంట ఉంటారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ మంగళవారం తెలిపారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లనున్నారు. ఆమె న్యూఢిల్లీకి తిరిగి వచ్చేలోపు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని కూడా పరామర్శిస్తారు అని రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 04న దేశ రాజధానిలో నిర్వహించే కాంగ్రెస్ “మెహంగై పర్ హల్లా బోల్ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని జైరాం రమేష్ తెలిపారు.సెప్టెంబర్ 7న “భారత్ జోడో యాత్ర”ని ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ గతవారం ప్రకటించింది.

కాంగ్రెస్ మంగళవారం భారత్ జోడో యాత్ర యొక్క లోగో, ట్యాగ్‌లైన్ మరియు వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. దక్షిణాదిలోని కన్యాకుమారి నుంచి ఉత్తరాన కాశ్మీర్ వరకు 3,570 కిలోమీటర్ల మేర యాత్ర (పాదయాత్ర) సాగుతుందని జైరాం రమేష్ తెలిపారు. సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే యాత్ర ఐదు నెలల పాటు కొనసాగనుంది.ఈ యాత్రలో పార్టీ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ఏక్ తేరా కదమ్, ఏక్ మేరా కదమ్, మిల్ జాయే టు జడ్ జాయే అప్నా వతన్ (ఒక అడుగు నీది, ఒక్క అడుగు నాది, కలిసి భారతదేశాన్ని ఏకం చేయగలరు) అని రాహుల్ గాంధీ యాత్రకు ట్యాగ్‌లైన్‌ను అంతకుముందు రోజు ట్వీట్ చేశారు.

Exit mobile version
Skip to toolbar