Foreign currency Seized: రూ. 4.1 కోట్ల విదేశీ కరెన్సీ స్వాధీనం.. ఎందులో దాచారంటే?

ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు రూ. 4.1కోట్లు విలువచేసే విదేశీ కరెన్సీ పట్టుబడింది. దీంతో ముగ్గురు ప్రయాణీకులను అధికారులు అరెస్ట్ చేశారు.

Mumbai: ముంబై ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులకు రూ. 4.1కోట్లు విలువ చేసే విదేశీ కరెన్సీ పట్టుబడింది. దీంతో ముగ్గురు ప్రయాణీకులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రయాణీకుల లగేజీని తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పందంగా వ్యవహరించడంతో ముగ్గురి ప్రయాణీకుల వస్తువలను తనిఖీలు చేశారు. ఓ వ్యక్తి తన బూటులో యూస్ డాలర్లను దాచివుంచిన్నట్లు గుర్తించారు. అదే విధంగా మరో వ్యక్తి పట్టుచీరలో డాలర్లు తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 4.97లక్షల యుఎస్ డాలర్లు అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు.

ఇది కూడా చదవండి: Hemant Soren: దమ్ముంటే అరెస్ట్ చేయాలి.. జార్ఖండ్ సీఎం