Site icon Prime9

G20 summit: G20 నేతల సదస్సు ..ఢిల్లీలో సెప్టెంబరు 8-10 వరకు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు బంద్

G20

G20

G20 summit: ఢిల్లీలో సెప్టెంబరు 8-10 తేదీల్లో జరిగే G20 నేతల సదస్సు సందర్భంగా ఢిల్లీ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు మరియు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నందున ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవలు ఢిల్లీలో అందుబాటులో ఉండవు.

ఢిల్లీలోకి వాహనాల ప్రవేశంపై నిషేధం..(G20 summit)

క్లౌడ్ కిచెన్‌లు మరియు ఫుడ్ డెలివరీలు లేదా అమెజాన్ డెలివరీల వంటి వాణిజ్య డెలివరీలు అనుమతించబడవని పోలీస్ స్పెషల్ కమిషనర్ యాదవ్ తెలిపారు.అయితే నగరంలో లాక్ డౌన్ ఊహాగానాలు తోసిపుచ్చారు.”ప్రియమైన ఢిల్లీవాసులారా, అస్సలు భయపడకండి! లాక్ డౌన్ లేదు. @dtpftraffic యొక్క వర్చువల్ హెల్ప్ డెస్క్‌లో అందుబాటులో ఉన్న ట్రాఫిక్ సమాచారంతో మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోండి అని ఢిల్లీ పోలీసులు X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేసారు.నగరంలో పటిష్టమైన ట్రాఫిక్ ఏర్పాట్లను కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 7 అర్ధరాత్రి నుండి సెప్టెంబర్ 10 అర్ధరాత్రి వరకు ఢిల్లీలోకి వాహనాల ప్రవేశంపై నిషేధం ఉంటుందని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలు ప్రధానంగా ధౌలా కువాన్ మార్గాన్ని ప్రభావితం చేస్తాయి.

 మూడు రోజులు పబ్లిక్ హాలిడే..

గురుగ్రామ్ కంపెనీలకు సెప్టెంబర్ 8న వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను అమలు చేయాలని పోలీసులు సూచించారు.ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 8 నుండి సెప్టెంబర్ 10 వరకు దేశ రాజధానిలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. అలాగే దుకాణాలు, వ్యాపారాలు మరియు వాణిజ్య సంస్థల యజమానులు తమ ఉద్యోగులు మరియు కార్మికులకు సెప్టెంబర్ 8, 9 మరియు 10 తేదీలలో వేతనంతో కూడిన సెలవులను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రపంచ నాయకులకు ఢిల్లీ ఆతిథ్యం ఇస్తున్నందున లక్ష మందికి పైగా భద్రతా సిబ్బందిని నగరమంతటా మోహరిస్తారు.

Exit mobile version
Skip to toolbar