Modi-surname Defamation case: మోదీ-ఇంటిపేరు పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి దక్కని ఊరట

2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులోకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును వెలువరించనున్నారు. అయితే అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 05:26 PM IST

Modi-surname Defamation case: 2019 నాటి ‘మోదీ ఇంటిపేరు’ పరువు నష్టం కేసులోకాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన పిటిషన్‌పై గుజరాత్ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. జస్టిస్ హేమంత్ ప్రచ్చక్ సెలవుల తర్వాత తీర్పును వెలువరించనున్నారు. అయితే అప్పటి వరకు రాహుల్ గాంధీకి మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు కోర్టు నిరాకరించింది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ దాఖలు చేసిన 2019 కేసులో భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) సెక్షన్లు 499 మరియు 500 (క్రిమినల్ పరువు నష్టం) కింద దోషిగా నిర్ధారించిన తరువాత మార్చి 23 న, సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు తర్వాత, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనల ప్రకారం, 2019లో కేరళలోని వాయనాడ్ నుంచి లోక్‌సభకు ఎన్నికైన  రాహుల్ గాంధీ  ఎంపీగా అనర్హుడయ్యారు.

స్టే ఇవ్వని కోర్టు..(Modi-surname Defamation case)

రాహుల్ గాంధీ ఆ తీర్పును సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేయడంతోపాటు శిక్షపై స్టే విధించాలని కోరారు. కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేస్తూ ఏప్రిల్ 20న కోర్టు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఏప్రిల్ 29, 2023న, రాహుల్ గాంధీ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈరోజు కోర్టు ముందు సుదీర్ఘ వాదనలు చేయడంతో గుజరాత్ హైకోర్టు విచారణను మే 2కి వాయిదా వేసింది. అతను రికార్డులో ఉన్న కొన్ని పత్రాలకు సమయం కోరాడు, ఆ తర్వాత కోర్టు దానిని అనుమతించి విచారణను మే 2కి వాయిదా వేసింది.

రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువునష్టం కేసును పూర్ణేష్ మోదీ తన ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరుగా ఎలా అయింది అంటూ ఏప్రిల్ 13, 2019న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ పరువు నష్టం కేసు దాఖలయింది.