Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేయనున్న కూతురు

గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 10, 2022 / 01:15 PM IST

Bihar: గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీల్లో ఒకదానిని దానం చేయాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్‌లో సింగపూర్ పర్యటనలో లాలూకు కిడ్నీ మార్పిడి చేయాలని అక్కడి వైద్యులు సలహా ఇవ్వడంతో రోహిణి తన కిడ్నీలో ఒకదాన్ని తన తండ్రికి దానం చేయడానికి ముందుకొచ్చింది.

లాలూ ప్రసాద్ మొదట రోహిణి తన కిడ్నీని దానం చేయడానికి ఇష్టపడలేదని, అయితే ఆమె కుటుంబ సభ్యులు చెప్పడంతో ఒప్పుకున్నట్లు సమాచారం. నవంబర్ 20-24 మధ్య లాలూ మళ్లీ సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే కిడ్నీ మార్పిడికి సంబంధించిన ఆపరేషన్ చేయించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగపూర్‌లో ఉన్న లాలూ రెండవ కుమార్తె రోహిణి తన తండ్రి కిడ్నీ వ్యాధి గురించి చాలా ఆందోళన చెందారు. కిడ్నీ మార్పిడికి సలహా ఇచ్చిన వైద్యుల బృందాన్ని సంప్రదించడానికి వెళ్లడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.