Bihar: బీహార్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. దానాపూర్ సమీపంలో గంగానదిలో ఓ పడవ మునిగిపోయింది. ప్రమాద సమయంలో పడవలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే 45మంది ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. మరో 10 మంది ప్రయాణికులు గల్లంతైనట్టు అధికారుల తెలిపారు. గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నాయి.
Boat Accident: బీహార్లో పడవ ప్రమాదం.. 10 మంది గల్లంతు
