Prime9

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు

Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ 90 రోజుల పాటు జైలు జీవితం అనుభవించారు. అతను ఎన్నుకోబడిన నాయకుడు. అతను సిఎం పాత్రలో కొనసాగాలా వద్దా అనేది అతని ఇష్టం” అని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.

కేజ్రీవాల్ అరెస్టును సమర్థించిన హైకోర్టు..(Arvind Kejriwal)

మే 17న జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై ఏప్రిల్ 15న సుప్రీంకోర్టు ఈడీని స్పందన కోరింది. ఈ కేసులో తన అరెస్టును సమర్థిస్తూ ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు.ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది, దానిలో ఎటువంటి చట్టవిరుద్ధం లేదని మరియు అతను పదేపదే సమన్లను దాటవేసి విచారణకు నిరాకరించడంతో ఈడీకి మరో చాయిస్ లేకుండా పో యిందని పేర్కొంది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. 2021-22 ఏడాదికి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, అమలు చేయడంలో అవినీతిచోటు చేసుకుందని మనీలాండరింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి.

Exit mobile version
Skip to toolbar