Narcotics Control Bureau: గంజాయి సరఫరాలో దేశంలోనే నెంబర్ వన్ ఏపీ

ఇంతవరకూ అప్పులు చేయడంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డుల దిశగా సాగుతోందని భావిస్తున్నారు. అయితే తాజాగా మరో విషయంలో కూడా ఏపీ రికార్డు సృష్టించింది. అదేమిటంటే గత ఏడాది దేశ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో అత్యధిక శాతం ఏపీదే కావడం విశేషం.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 01:58 PM IST

New Delhi: ఇంతవరకూ అప్పులు చేయడంలోనే ఆంధ్రప్రదేశ్ రికార్డుల దిశగా సాగుతోందని భావిస్తున్నారు. అయితే తాజాగా మరో విషయంలో కూడా ఏపీ రికార్డు సృష్టించింది. అదేమిటంటే గత ఏడాది దేశ వ్యాప్తంగా పట్టుబడిన గంజాయిలో అత్యధిక శాతం ఏపీదే కావడం విశేషం.

దేశంలో గంజాయి సరఫరాలో ఏపీ మొదటి స్థానంలో ఉందని నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) తెలిపింది. 2021కి చెందిన నివేదికను ఎన్సీబీ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఏడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు నివేదికలో ఎన్సీబీ తెలిపింది. ఇందులో ఏపీ నుంచి 26 శాతం గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోనే రెండు లక్షల కిలోలకు పైగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండో స్థానంలో ఒడిశా ఉంది. దేశంలో 50 శాతం గంజాయి ఈ రెండు రాష్ట్రాల్లోనే సాగవుతోంది. ఏపీలో గంజాయి సరఫరా పై 1,775 కేసులు నమోదయ్యాయి. గంజాయిని తరలిస్తూ పట్టుబడిన 4,202 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తెలంగాణలో 35,270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇక మత్తు పదార్ధాల ప్రభావం పంజాబ్‌ లో ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. హెరాయిన్‌ విషయంలో గుజరాత్‌ తొలి స్థానంలో ఉందని తెలిపారు. రెండో స్థానంలో యూపీ ఉంది. దేశ వ్యాప్తంగా 7618 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. అత్యధికంగా గుజరాత్‌లో 3334 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో రెండో స్థానంలో యూపీ ఉంది. యూపీలో 1337 కిలోల హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఎన్సీబీ నివేదిక ప్రకారం అత్యధిక మత్తుపదార్థాల ప్రభావం పంజాబ్‌ లో ఉన్నట్టు తేలింది.